ఘనంగా మహాత్మ జ్యోతిరావ్ ఫూలే 198 వ జయంతి

బద్వేలు, ఏప్రిల్ :11: ఆర్ బి ఎన్ న్యూస్

కడపజిల్లా బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో శుక్రవారం మహాత్మ జ్యోతిరావ్ ఫూలే 198 వ జయంతిని పురష్కరించుకొని ఫూలే విగ్రహ నిర్మాణ కమిటి చైర్మెన్ బద్వేలు గురుమూర్తి,ఉత్సవ కమిటి చైర్మెన్ యర్రగొల్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ మహారాష్ట్ర లోని సతారా జిల్లా,కాట్గూన్ గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో ఏప్రిల్ 11,1827 న జన్మించి, మిషనరీ స్కూలు లో విద్యాభ్యాసం చేసి విద్య ద్వారానే సమాజం చైతన్యం అభివృద్ది సాధ్యమని,అసమానతలు రూపు మాపుతాయని నమ్మి విద్యకు దూరంగా వున్న అన్నివర్గాల ప్రజల విద్య కొరకు మరియు”సత్యసోధక్” సమాజాన్ని స్థాపించి సమసమాజ స్థాపనకు,ఎన్నో రచనల ద్వార సమాజాన్ని చైతన్య పరచి,స్తీ విద్యాభివృద్ది కొరకు భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను 1848 పూణేలో ఏర్పాటుచేసి “మహాత్మ”అనే బిరుదు పొంది, అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త ఫూలే అని కొనియాడారు. అనంతరం ఫూలే,సావిత్రబాయి ఫూలే జీవిత చరిత్ర మరియు “మానస వికాసానికి మాటల ముత్యాలు” అను పుస్తకాలను పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో రైట్ టు ఫోరం ఫర్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,పట్టణ అభివృద్ది సొసైటి అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి,సంఘమిత్ర ఛైతర్మెన్ సొద్దల పెంచలయ్య, జాతీయ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు సుభాన్ బీ,జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ రమణ యాదవ్,ఆవాజ్ కమిటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ అన్వర్ భాష,ఫూలే ఆశయ సాధన సమితి సభ్యులు మిరియం రమణయ్య, బాలయ్య, సీనియర్ దళిత నాయకులు ఒ.యస్.వి ప్రసాద్,సి నారాయణ, కేశవ, వెంకట రమణ, బలాగుర్రన్న, రజినీస్, ఆర్ ఎఫ్ ఆర్టీఐ నియోజకవర్గ కన్వీనర్ కిషోర్ కుమార్, బి.వీరారెడ్డి,కె. రమణారెడ్డి,కె. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :