ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు
కడప బ్యూరో, ఏప్రిల్ : 10: ఆర్ బి ఎన్ న్యూస్
వైయస్సార్ కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసినట్లు ప్రొద్దుటూరు డిఎస్పీ పూతి భావన తెలిపారు.గురువారం
ప్రొద్దుటూరు డిఎస్పి కార్యాలయంలో డిఎస్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు.ఈసందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ అందరి పైనా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసామని,ఒక సారి వ్యవస్థీకృత నేరము నమోదైతే యువకుల బంగారు భవిష్యత్తు అంధకారమవుతుందని తెలిపారు.యువత బెట్టింగ్ వంటి ఆర్థిక నేరాలకు దూరంగా ఉండాలని డిఎస్పీ సూచించారు.ఈ కేసు ఛేదనలో సి.ఐ లు ల,సదాశివయ్య , రామకృష్ణారెడ్డి,బాల మద్దిలేటి , గోవిందరెడ్డి,ఎస్సైలు సంజీవరెడ్డి,శ్రీనివాసులు పాల్గొన్నారు.
Post Views: 57