ఈ నెల 11 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు.
కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 13 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు
కడప బ్యూరో ఏప్రిల్ 10:ఆర్ బి ఎన్ న్యూస్
ఈ నెల 11 న శుక్రవారం ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో,ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11 వ తేదీ ఉదయం నుండి 12 వ తేది ఉదయం వరకూ అమలులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణ సందర్బంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాతీయ రహదారి-716 మీదుగా వచ్చు భారీ వాహనాలను రేణిగుంట, రాజంపేట, కడప వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా జాతీయ రహదారి-716 మీదుగా కాకుండా ఇతర మార్గాలలో 11వ తేది ఉదయం 06:00 గంIIల నుండి 12వ తేది ఉదయం 10 గంIIల వరకు దారి మళ్ళించడం జరుగుతుందని రాజంపేట వైపు నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు, ఆర్.టి.సి. బస్సులు ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ వద్ద మరియు సిద్ధవటం మండలం ఉప్పరపల్లి సాయిబాబా గుడి వద్ద 11 వ తేది మధ్యాహ్నం 12:00 గంIIల నుండి 12 వ తేది ఉదయం 10 గంIIల వరకు దారి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు.